ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో ఏపీ నుంచి లండన్ కు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యువకుడు అరెస్ట్..

ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో ఏపీ నుంచి లండన్ కు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యువకుడు అరెస్ట్..

ఫారిన్ వెళ్లి చదివి అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది కలలు కంటూ ఉంటారు.. తమ కల నెరవేర్చుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేవారు కొంతమంది ఉంటే.. జాబ్ సంపాదించి వెళ్లేవారు మరికొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం అడ్డదారిలో వెళ్లి అక్కడ అధికారులకు చిక్కి ఇబ్బంది పడుతుంటారు. ఏపీకి చెందిన ఓ యువకుడు కూడా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో స్టూడెంట్ వీసా సాధించి లండన్ వెళ్ళడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఏపీకి చెందిన మొహమ్మద్ షాబాజుద్దీన్‌ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో సాధించిన స్టూడెంట్ వీసాతో లండన్ వెళ్తుండగా.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో షాబాజుద్దీన్ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ తో వీసా పొందినట్లు గుర్తించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. సాధారణ తనిఖీలో భాగంగా షాబాజుద్దీన్ సర్టిఫికెట్స్ ను వెరిఫై చేసిన అధికారులు ఫేక్ సర్టిఫికెట్స్ గా గుర్తించారు. 

హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించాడు షాబాజుద్దీన్. అతని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ కూడా నకిలీదే అని గుర్తించారు అధికారులు. షాబాజుద్దీన్ నాగార్జున యూనివర్సిటీలో బీకామ్ డిగ్రీ చేసినట్లు గుర్తించారు అధికారులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.