యుద్ధం ఎఫెక్ట్​తో ఉక్రెయిన్​ ఎయిర్​స్పేస్​ క్లోజ్​

యుద్ధం ఎఫెక్ట్​తో ఉక్రెయిన్​ ఎయిర్​స్పేస్​ క్లోజ్​

కీవ్​: ఉక్రెయిన్​ యుద్ధం ఎఫెక్ట్​ విమానాలపై పడింది. అన్ని దిక్కుల నుంచీ రష్యా బాంబులతో విరుచుకుపడుతుండడంతో.. అన్ని దేశాల ఎయిర్​లైన్స్​ విమానాలను బంద్​పెట్టాయి.దాడి చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ ప్రకటించగానే.. తమ ఎయిర్​స్పేస్​ను మూసేస్తున్నట్టు ఉక్రెయిన్​ ఎయిర్​ ట్రాఫిక్​ సర్వీసెస్​ ఎంటర్​ప్రైజెస్​ ప్రకటించింది. ఉక్రెయిన్​కు సరిహద్దుల్లోని రోస్తోవ్​ ఎయిర్​స్పేస్​ను మూసేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. రోస్తోవాన్​ డాన్​, క్రాశ్నోడార్​, స్తావ్రోపోల్​ ఎయిర్​పోర్టులను మార్చి 2 దాకా క్లోజ్​ చేస్తున్నట్టు వెల్లడించింది. బెలారస్​ కూడా ఎయిర్​స్పేస్​ను మూసేసింది. రష్యా, బెలారస్​తో పాటు ఉక్రెయిన్​ సరిహద్దులకు చుట్టుపక్కల 100 నాటికల్​ మైళ్ల వరకున్న ఎయిర్​స్పేస్​ అంత సేఫ్​ కాదని యూరోపియన్​ యూనియన్​ ఏవియేషన్​ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్​ఏ) అలర్ట్​ జారీ చేసింది.

ఆ దారిలో విమానాలు వెళ్తే కావాలని లేదా పొరపాటున కూల్చేసే ముప్పుందని హెచ్చరించింది. ఉక్రెయిన్​, క్రిమియా మీదుగా వెళ్లొద్దంటూ అమెరికా, బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్​, ఇటలీలు కూడా తమ ఎయిర్​లైన్స్​కు ఆదేశాలిచ్చాయి. ఉక్రెయిన్​ ఎయిర్​స్పేస్​ దాకా వెళ్లిన కొన్ని విమానాలు.. గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటన రాగానే వెనక్కు మళ్లాయి. ఇజ్రాయెల్  రాజధాని టెల్​అవీవ్​ నుంచి టొరంటోకు బయల్దేరిన ఎల్​అల్​ విమానం, వార్సా నుంచి కీవ్​కు వెళ్తున్న పోలండ్​ లాట్​ ఎయిర్​లైన్స్​ విమానం వెనక్కు వచ్చేశాయి. జర్మనీకి చెందిన లుఫ్త్​హాన్సా, కేఎల్​ఎం ఎయిర్​లైన్స్​ సోమవారం నుంచి సర్వీసులను బంద్​పెట్టాయి. ఉక్రెయిన్​లోని రెండు ఎయిర్​లైన్స్​ సంస్థలు గతవారమే సర్వీసులను నిలిపేశాయి. 

ఎంహెచ్​17 కూల్చివేతతో అలర్ట్​
క్రిమియాను రష్యాలో కలిపేసుకునే సందర్భంలో 2014లోనూ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఆ టైంలోనే ఉక్రెయిన్​ ఎయిర్​స్పేస్​ నుంచి వెళ్తున్న మలేసియా విమానం ఎంహెచ్​17ను ఉక్రెయిన్​ బలగాలు కూల్చేశాయి. ఆ ఘటనలో వందలాది మంది చనిపోయారు. అప్పట్నుంచి యుద్ధ భయాలున్న ప్రాంతాల నుంచి విమానాలను దారి మళ్లించడం, వాటిని అలర్ట్​ చేయడం కోసం ‘సేఫ్​ ఎయిర్​స్పేస్​’ అనే వెబ్​సైట్​ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉక్రెయిన్​ ఎయిర్​స్పేస్​ అంత సేఫ్​ కాదని సేఫ్​ ఎయిర్​స్పేస్​ ప్రకటించింది.

వాపస్​ వచ్చిన ఎయిరిండియా ఫ్లైట్
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధానికి దిగడంతో ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. దీంతో ఫ్లైట్ వెనక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మనోళ్లను స్వదేశానికి తీసుకురావడానికి వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లీంది. ఉక్రెయిన్‌కు వెళ్లే అన్ని విమానాలకు నోటామ్ లేదా ఎయిర్‌మెన్‌లకు నోటీసు పంపిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చింది.