అల్టిమేట్ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యు ముంబా

 అల్టిమేట్ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యు ముంబా

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అల్టిమేట్ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (యూటీటీ)లో యు ముంబా జట్టు సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యు ముంబా 10–5తో దబాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢిల్లీపై గెలిచింది. దాంతో ఢిల్లీ వరుస విజయాలకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. అయినప్పటికీ ఢిల్లీ 44 పాయింట్లతో టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంతాపంగా ఇరుజట్లు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరించి బరిలోకి దిగాయి. 

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2–1తో సత్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్ఞానశేఖరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచాడు. తర్వాతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బెర్నాడెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2–1తో దియా చితాలేను ఓడించగా, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెర్నాడెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–2తో దియా చితాలే–క్వెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో కంగుతిన్నారు. 

నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీబీ అభినందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2–1తో క్వెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెగ్గాడు. కీలకమైన ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యశస్విని గోర్పడే 3–0తో సుహానా సైనీపై గెలిచింది. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ.. జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేట్రియాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, యు ముంబా.. డెంపో గోవాతో తలపడతాయి.