బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట మరో విషాదం జరిగింది. ఓ వైపు ముంబైలోని శ్మశానవాటికలో సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో…బీహార్ లోని పూర్ణియాలో అతడి వదిన(కసిన్ బ్రదర్ భార్య) సుధా దేవి కన్నుముశారు. సుశాంత్ మరణ వార్తను విన్న తర్వాత నుంచి ఆమె ఆహారం తీసుకోలేదు. సుశాంత్ మృతితో కుంగిపోయిన ఆమె చనిపోయారు.
ఆదివారం ఉదయం ముంబైలోని తన బాంద్రా నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.