రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమానికి వెళ్లలేకపోతున్న: మోహన్ బాబు

రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమానికి వెళ్లలేకపోతున్న: మోహన్ బాబు

కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర(Ram Mandhir) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రేపు(జనవరి 22) ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ అపురూప క్షణాల కోసం దేశ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. అందులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో నటుడు మోహన్ బాబుకు కూడా ఉన్నారు.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను అయోధ్యకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఇదే విషయాన్ని వివరిస్తూ లేఖ విడుదల చేశారు మోహన్ బాబు.. అయోధ్య వేడుకకు నాకు కూడా ఆహ్వానం అందింది. అయితే, భద్రతా కారణాల వల్ల నేను వెళ్లలేకపోతున్నాను. అందుకు నను క్షమించండి. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఇక ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానం పాలక మండలి ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించాను. ఆ ఆలయంలో వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, షిర్డీ సాయిబాబా, లక్ష్మీనరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజున ఇక్కడ ప్రత్యేక పూజాలు నిర్వహిస్తామని.. తెలిపారు మోహన్ బాబు.