‘రామ్ సేతు"లో నటించానంటే నమ్మలేకపోతున్నా - జయశ్రీ రాచకొండ

‘రామ్ సేతు"లో నటించానంటే నమ్మలేకపోతున్నా - జయశ్రీ రాచకొండ

‘రామ్ సేతు"లో తన నటనను అందరూ అభినందిస్తున్నారని అక్షయ్ కుమార్ తాజా చిత్రం "రామ్ సేతు"లో జడ్జిగా నటించిన నటి జయశ్రీ రాచకొండ తెలిపారు. సినిమా చూసిన వాళ్లు పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు చెప్పారు. షూటింగ్ లో భాగంగా వారం రోజులు చేసిన సీన్స్ అన్నీ కథకు అత్యంత కీలకమైనవన్నారు. అయితే ఎడిటింగ్ లో అవన్నీ ఎగిరిపోతాయేమోననే అనుమానం ఉండేదని అన్నారు. ట్రైలర్ లో తెగ మురిసిపోయినా... తన అదృష్టం మీద అనుమానం కలుగుతూనే ఉండేదని కానీ ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారని అన్నారు. 

ఈనెల 25న విడుదలైన రామ్ సేతు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితర స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలలానే ఉందని అంటున్నారు. ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం "లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది... చెప్పాలనున్నది, బ్రేకింగ్ న్యూస్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న డాక్టర్ రెహానా" తదితర చిత్రాలతో పాటు పలు యాడ్ ఫిల్మ్స్ లో జయశ్రీ నటిస్తున్నారు.