కుప్పకూలిన బ్రిడ్జ్ .. ముగ్గురు నుజ్జునుజ్జు

కుప్పకూలిన బ్రిడ్జ్ ..  ముగ్గురు నుజ్జునుజ్జు

గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న  బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.  బ్రిడ్జ్ కూలడంతో ట్రాక్టర్‌, ఆటో కూడా నుజ్జునుజ్జయ్యాయి.  అంబాజీకి వెళ్లే పాలన్‌పూర్ ఆర్‌టీఓ సర్కిల్ మార్గంలో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్  చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. విషయం తెలియగానే  స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కాగా గతేడాది గుజరాత్ లోని మోర్చిలోని మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోవడంతో 132 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.