పీయూష్ గోయల్ రైతులను అవమానించిండు

పీయూష్ గోయల్ రైతులను అవమానించిండు

హైదరాబాద్: పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్ అని కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయల్ పై సీఎం కేసీఆర్ సైటైర్ వేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశంలోని ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేంద్ర మంత్రులు తమ ప్రభుత్వంపై విమర్శించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. గతంలో  కేంద్ర వ్యవసాయ మంత్రి పీయూష్ గోయల్ రైతులను అవమానించేలా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలా? అని మండిపడ్డారు. కేంద్రం కొనకపోవడంతో టన్నుల కొద్దీ బియ్యం మిల్లుల్లో మూలుగుతున్నాయని ఫైర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను సాగనంపడం పక్కా అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.