- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి: జ్యోతిరాదిత్య ఎం. సింధియా
న్యూఢిల్లీ: నల్గొండ జిల్లా పరిధిలో ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పరిధిలో ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిన ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. దర్యాప్తు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. దురదృష్టవశాత్తు, విద్యార్థి పైలట్ను కోల్పోయాము" అని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల కేంద్రంగా "ఫ్లై టెక్ కేబీయేషన్ అకాడమీ" కి చెందిన ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ను తమిళనాడుకు చెందిన శిక్షణ పైలెట్ మహిమ నడుపుతూ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Shocked to hear about the tragic crash of a training aircraft in Nalgonda, Telangana. An investigation team has been rushed to the site.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 26, 2022
Unfortunately, we lost the student pilot. My heartfelt condolences to the bereaved family & loved ones.
ఇవి కూడా చదవండి
బాంబు మోతల మధ్య అండర్ గ్రౌండ్ బంకర్ లో గర్భిణి ప్రసవం
టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది
ఉక్రెయిన్కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం
రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ