శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ అగ్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. అమిత్ షా ఈ రాత్రికి పోలీస్ అకాడమీలో బస చేయనున్నారు. ఉదయం 8.30గంటల నుంచి 10.45గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. ఉదయం 11 గంటల తర్వాత బేగంపేట్ టూరిజం హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ అమిత్ షా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు అమిత్ షా హాజరవుతారు. రాత్రి 7.30గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.