తెలంగాణ జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్రం ఆమోదం

తెలంగాణ జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించిన జోనల్ వ్యవస్థలో మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తూ.. ఆమోదం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని బుధవారం నాడు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలియజేసింది. 
జోగులాంబ జోన్ లో నారాయణపేట జిల్లాను.. కాళేశ్వరం జోన్ లో ములుగు జిల్లాకు చోటు కల్పించారు. అలాగే వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి మార్చి చార్మినార్ జోన్ కు మార్చారు. ఇకపై ఈ మార్పులకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేపడతారు. స్థానికతను కూడా ఇదే ప్రకారం ఖరారు చేస్తారు. కేంద్ర హోంశాఖ ఆమోదం తెలియజేసిన నేపధ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.