కేంద్ర హోమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘనందన్ రావు, ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమిత్ షా.. చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభకు చేరుకోనున్నారు. అక్కడ దాదాపు గంట సేపు అమిత్ షా ఉండనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గర పడుతోన్న సందర్భంలో అమిత్ షా ఈ సభలో ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. తాము కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సభను రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ అనంతరం నేరుగా రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు.