‘సత్య కాలమ్’ బుక్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి 

‘సత్య కాలమ్’ బుక్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి 

హైదరాబాద్: ఒక పార్టీతో దేశాన్ని నడిపించాలని తాము కోరుకోవటంలేదని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ఇదే విధంగా మిగతా పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాసిన ‘సత్య కాలమ్’ పుస్తకాన్ని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉజ్వల పథకం, గ్రామాలకు కరెంట్, రైతులకు సమ్మాన్ నిధి, కరోనా వ్యాక్సినేషన్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. ఏదైనా విషయాన్ని చెప్పటం కన్నా.. రాయటం చాలా కష్టంమన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.