సమ్మక్క సన్నిధిలో రాష్ట్ర బీజేపీ నేతలు

సమ్మక్క సన్నిధిలో రాష్ట్ర బీజేపీ నేతలు

మేడారం వన దేవతల దర్శనానికి వీఐపీలు క్యూ కట్టారు. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్, రాష్ట్ర మంత్రులు ఐకేరెడ్డి, గంగుల, తలసానితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆపార్టీ నేతలు అమ్మవారి దర్శనాకి వెళ్లారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, గుంగుల వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అమ్మలను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు మంత్రులు.