ఎన్నికల దృష్ట్యా బీజేపీని బలోపేతం చేయాలె : కిషన్ రెడ్డి

ఎన్నికల దృష్ట్యా బీజేపీని బలోపేతం చేయాలె : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నూతన ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రధాని మోడీ హాజరవుతారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ స్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలు, నాయకులు కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. బీజేపీ లక్ష్మీనగర్ శక్తి కేంద్రం వర్క్ షాప్ ను బూత్ సశక్తికరణ్ అభియాన్ నాయకులు గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో లాలాపేటలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, మహంకాళి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రెటరీ మేకల సారంగపాణితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.