అంబర్ పేటలో కిషన్ రెడ్డి భావోద్వేగం

అంబర్ పేటలో కిషన్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానపరిచారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట నియోజకవర్గానికి రాగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. అక్కడ అందిన భారీ స్వాగతంతో భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేంద్రమంత్రి అయ్యానంటే... అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదమే అన్నారు. దేశానికి మంత్రినైనా... అంబర్ పేట బిడ్డనే అన్నారు కిషన్ రెడ్డి. సీఎం పదవి తన చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ఎక్కడుంటారో తెలియని గందరగోళ పరిస్థితి ఉందన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడి చేతిలో తెలంగాణ బందీ అయిందని.. బంధ విముక్తి కోరుకుంటోందని చెప్పారు కిషన్ రెడ్డి.