- భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టించి ప్రతిపక్షాలపై నిందలా ?
- మేం నిర్మాణాత్మక సూచనలే చేస్తున్నం
- కల్వకుంట్ల కుటుంబమే రాజకీయాలు చేస్తోంది
- మంత్రి కేటీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్
- జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పర్యటించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని భ్రష్టుపట్టిస్తూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తారా అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలకు బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ జూబ్లీహిల్స్ వెంకటగిరి డివిజన్ లో పొంగిపొర్లుతున్న నాలాలను ఆయన పరిశీలించారు. స్వయంగా నీళ్లలో నడుస్తూ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచే అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ మేము రాజకీయం చేయడం లేదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తుంటే... రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే రాజకీయాలు చేస్తోంది.
వారం రోజులుగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది.హైదరాబాద్లో వరద కాలువలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. వర్షపు నీటి కాలువలు పూడిక తీయని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పూడిక తీసే కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ఆగిపోయాయి. హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తం.. సింగపూర్, లండన్, న్యూయార్క్, వాషింగ్టన్ చేస్తామని ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పారు. కానీ చిన్న వర్షాని కే హైదరాబాద్ అతలాకుతలమై జన జీవనం స్తంభించిపోయింది’ అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.