సైన్స్ సిటీ ఏర్పాటుపై కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

సైన్స్ సిటీ ఏర్పాటుపై కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం అవసరమైన 25 ఎకరాల స్థలం, గైడ్ లైన్స్ కు అనుగుణంగా డీపీఆర్​ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.  ఈ మేరకు సీఎం కేసీఆర్​కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. సైన్స్ సిటీ అనేక ఆవిష్కరణలకు వేదిక అవుతుందని, పర్యాటకంగానూ నగరానికి గుర్తింపు వస్తుందని తెలిపారు. 

కోల్​కత్తా, బెంగుళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను రోజూ వేలాది మంది స్టూడెంట్స్​ సందర్శిస్తున్నారన్నారు. దేశంలో ఐదో సైన్స్ సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడం సంతోషకరమన్నారు.