న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం అవసరమైన 25 ఎకరాల స్థలం, గైడ్ లైన్స్ కు అనుగుణంగా డీపీఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. సైన్స్ సిటీ అనేక ఆవిష్కరణలకు వేదిక అవుతుందని, పర్యాటకంగానూ నగరానికి గుర్తింపు వస్తుందని తెలిపారు.
కోల్కత్తా, బెంగుళూరు, ముంబై, కురుక్షేత్ర సైన్స్ సిటీలను రోజూ వేలాది మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారన్నారు. దేశంలో ఐదో సైన్స్ సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడం సంతోషకరమన్నారు.