హోర్డింగ్స్ పేరిట ప్రజల సొమ్ము వృథా

హోర్డింగ్స్ పేరిట ప్రజల సొమ్ము వృథా

అవినీతి సొమ్ముతో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఆరోపించారు. సీఎం కొడుకు సీఎం కాలేడని, తమ సామాన్య కార్యకర్త కూడా ప్రధాని అవుతారని చెప్పారు. అధికారం పోతుందని టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని చురకలంటించారు. రాజకీయాలను సీఎం కేసీఆర్ దిగజార్చారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని అన్నారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయం పట్టుకుందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు.