ప్రపంచంలోనే బెస్ట్ వ్యాక్సిన్ ఉత్పత్తి మన దగ్గరే

ప్రపంచంలోనే బెస్ట్ వ్యాక్సిన్ ఉత్పత్తి మన దగ్గరే

138 దేశాల వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలో బెస్ట్ వ్యాక్సిన్ మన దేశంలోనే ఉత్పత్తి అవుతుందన్నారు. 500 కోట్ల డోసులు విదేశాలకు అందించడానికి దేశంలోని కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారాహిల్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కరోనా టైంలో వర్క్ చేసిన పలువురు జర్నలిస్ట్ లకు అవార్డులను అందజేశారు.

కాగా, సీఎం కేసీఆర్ అంగీకరిస్తే రాష్ట్రంలో వికలాంగుల వైద్య సేవల ఖర్చు కోసం 5 లక్షల ఆయుష్మాన్ భారత్ గోల్డ్ కార్డు అందిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రవీంద్రభారతిలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర సర్కార్ దివ్యాంగుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి.  తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ లో దివ్యాంగులకు వీల్ చైర్స్, దుప్పట్లు పంపిణీ చేశారు.