భద్రాద్రికొత్తగూడెం/ జయశంకర్భూపాలపల్లి, వెలుగు: ఈ నెల 13న భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పార్టీ ఆఫీస్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ పర్యటనలో కేంద్ర మంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని తెలిపారు. తాడిచర్ల–2 కోల్ బ్లాక్ను సింగరేణికి కేంద్రం ఇవ్వడాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలో సంబురాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
కాగా, సోమవారం సాయంత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి రానున్నారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, జెన్కో గెస్ట్హైస్లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం కేటీకే 8వ గని వద్ద సింగరేణి కార్మికులతో మీటింగ్లో పాల్గొంటారు. మల్హర్ మండలం తాడిచెర్ల బ్లాక్–2 ప్రాజెక్టును సందర్శించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి వివరించారు.
