గౌడ కులస్తులకు గౌడబంధు ఇవ్వాలి

గౌడ కులస్తులకు గౌడబంధు ఇవ్వాలి

కమలాపూర్: దళితులతో పాటు గౌడ కులస్థులకు కూడా గౌడబంధు ఇవ్వాలని కేంద్రమంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. కమలాపూర్‎లో జరిగిన గౌడగర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గౌడ సమాజానికి తెలంగాణ సీఎం ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్‎కు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ పాలన సాగిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు, దళిత వర్గాలకు అండగా ఉండాలని మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు.