కేంద్రమంత్రిని.. నాకే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు

కేంద్రమంత్రిని.. నాకే కేసీఆర్  అపాయింట్మెంట్ ఇవ్వలేదు

సీఎం కేసీఆర్ నాకే దొరకడం లేదు.... ఇక జనాలకు ఏం దొరుకుతారన్నారు కేంద్రమంత్రి శోభ కరంద్లాజే. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న ఆమె మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. మోడీ పథకాలను కేసీఆర్ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు శోభ. నిజాం మైండ్ సెట్ తో కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మేలుకొని... కేసీఆర్ జనాల్లోకి రావాలన్నారు శోభ.