ఉక్రెయిన్ లో చిక్కుకున్నఅందరినీ తీసుకొస్తాం

ఉక్రెయిన్ లో చిక్కుకున్నఅందరినీ తీసుకొస్తాం

ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘన స్వాగతం పలికారు.స్టూడెంట్స్ తో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతున్నా..ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.మీ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని..మీ రాకతో వారి కళ్లల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. స్వదేశానికి తిరిగి రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు.

 


మరిన్ని వార్తల కోసం

 

జోరుగా గోద్రెజ్​ జెర్సీ పాల అమ్మకాలు

బిలియనీర్లలో ఇండియాది మూడోప్లేస్​