వీడిన మిస్టరీ.. వడ్డే ఎల్లయ్య మృతదేహం లభ్యం

వీడిన మిస్టరీ.. వడ్డే ఎల్లయ్య మృతదేహం లభ్యం
  • మృతుడు బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు  
  • వైజాగ్​ సముద్రంలో పడేశామని అబద్దం చెప్పిన నిందితులు 
  • జగ్గయ్యపేట మండలం బండిపాలెం వద్ద గుర్తింపు

సూర్యాపేట, వెలుగు : సంచలనం సృష్టించిన సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్యపేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను గత నెల18న జగ్గయ్యపేటకు తీసుకెళ్లి హత్య చేశారు. 20 రోజులు గడుస్తున్నా మృతదేహం జాడ దొరకలేదు. దీంతో నిందితుడు దొరికినా కేసు ముందుకు కదలలేదు. ఎట్టకేలకు బుధవారం జగ్గయ్యపేట మండలం బండిపాలెం వద్ద ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది. ఎల్లయ్యను హత్య చేసిన తర్వాత జగ్గయ్యపేట మండలం బండిపాలెం శివారులో మృతదేహాన్ని కాల్చేందుకు నిందితులు ప్రయత్నించారు.

 అయితే, మంటలు పెద్దగా వ్యాపించడంతో భయపడి మంటలను ఆర్పి అక్కడే గుంత తీసి పాతిపెట్టారు. ఈ కేసులో నిందితులను గుర్తించగా  ఎల్లయ్యను హత్య చేసిన తర్వాత చేపల లారీలో విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేశామని పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి ఎల్లయ్య డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నా దొరకడం లేదు. చివరకు పోలీసులు గట్టిగా విచారించగా జగ్గయ్యపేట మండలం బండిపాలెం వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నారు. దీంతో డెడ్​బాడీని  వెలికితీశారు. జగ్గయ్యపేట తహసీల్దార్​ సమక్షంలో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.