
జైపూర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే )త్వరలో భారత్లో కలుస్తుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. రాజస్థాన్లోని దౌసాలో సోమవారం జరిగిన బీజేపీ పరివర్తన్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జీ20 సమిట్ను విజయ వంతంగా నిర్వహించి ప్రపంచానికి భారత్ తన సత్తా చాటిందని ఆనందం వ్యక్తంచేశారు.
పీవోకే కచ్చితంగా మన దేశంలో కలుస్తుంది. అయితే, అందుకు కొంత టైమ్ పడుతుంది. మనం కాస్త ఓపికతో వేచి ఉంటే సరిపోతుందని కేంద్ర మంత్రి చెప్పారు. రాజస్థాన్లో శాంతిభద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిలైందని సింగ్ ఆరోపించారు. యువతకు, రైతులకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేద న్నారు. అందుకే, ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు బీజేపీ పరివర్తన్ సంకల్ప్ యాత్ర చేపట్టిందన్నారు.