కిషన్రెడ్డికి యూఎన్ డబ్ల్యూటీవో ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్లోని యూఎన్ ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి గా ప్రసంగించే చాన్స్ ఆయనకు లభించింది. ఈమేరకు యూఎన్ డబ్ల్యూటీఓ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఆయనకు ఆహ్వానం పంపింది.
ఇప్పటివరకు ఈ అరుదైన అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి నిలిచారు. ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, -వివిధ భాగస్వామ్య పక్షాలను ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ అన్న ఇతివృత్తంతో జులై 13, 14న ఈ సమావేశాలు జరగనున్నాయి.