బీఆర్ఎస్​కు యునైటెడ్ ముస్లిం​ ఫోరం మద్దతు

బీఆర్ఎస్​కు యునైటెడ్ ముస్లిం​ ఫోరం మద్దతు

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ​పార్టీకి యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు ప్రకటించింది. శుక్రవారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ను కలిసి ఎన్నికల్లో మద్దతునిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మైనార్టీల స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చాయని, ఇందుకు బీఆర్ఎస్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. మైనార్టీ గురుకులాలతో విద్యార్థుల భవిష్యత్​ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

షాదీ ముబారక్​తో పేదలకు మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత ఘర్షణలు లేవని, ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరమే రాలేదన్నారు. గంగా జమున తెహజీబ్​గా తెలంగాణ వర్ధిల్లుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్​కు మద్దతు తెలిపిన యునైటెడ్ ​ముస్లిం  ఫోరం నాయకులకు కేటీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్​ను కలిసినవారిలో మౌలానా అక్బర్​ నిజాముద్దీన్, జియావుద్దీన్​నయ్యర్  జహీరుద్దీన్ ​అలీ తదితరులు​ఉన్నారు.