యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాల(శనివారం) నోయిడా సెక్టార్ 39లోని జిల్లా ఆస్పత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ కరోనా ఆస్పత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ యూనిట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో పాటు…నిపుణులైన డాక్టర్లను నియమించారు. ఈ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 400 పడకలు సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, ఐదవ అంతస్తులో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. అలాగే రెండవ అంతస్తులో డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ వార్డులు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటనకు ముందు 15గెజిటెడ్ అధికారులు, విధుల్లో ఉన్న 700 మంది కానిస్టేబుళ్లు కొవిడ్19 పరీక్షలు చేయించుకున్నట్లు… అదనపు నోయినా ఏడీసీపీ రణవిజయ్ సింగ్ తెలిపారు. యూపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య నోయిడా సెక్టార్ 39లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు.