లక్నో: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాసేపు జూలో గడిపారు. చిరుత పులికి పాలు తాగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా సీఎం యోగి గోరఖ్పుర్లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జూలాజికల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా గీత అనే చిరుత పిల్లను సీఎం జూలో విడిచిపెట్టారు. ఈ క్రమంలో ఆయన ఆ చిరుతకు పాలు తాగించారు.
అనంతరం యోగి ఆ చిరుతకు చంఢీ అని పేరు పెట్టారు. కాగా రెండున్నర నెలల కిందట ఆ చిరుతను జూ అధికారులు ఇక్కడికి తీసుకొచ్చారు.