యూపీలో దళితుడికి గుండు గీయించిన బీజేపీ నేత

యూపీలో దళితుడికి గుండు గీయించిన బీజేపీ నేత

యూపీ బహ్రెచ్ లో దారుణం జరిగింది. హార్ది ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే నెపంతో దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. బీజేపీ నేత రాధేశ్యామ్ మిశ్రా, అనుచరులతో కలిసి బాధితున్ని స్తంభానికి కట్టేసి, అతని ముఖానికి నల్ల రంగు పూశారు. అంతటితో ఆగకుండా గుండు చేయించారు. అనంతరం తీవ్రంగా కొట్టారు.

రాధే శ్యామ్ మిశ్రా బాధితున్ని కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సదరు యువకుడి కుటుంబసభ్యులు మిశ్రా, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు  చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడికి పాల్పడిన రాధేశ్యామ్ మిశ్రా ప్రస్తుతం పరారీలో ఉండగా.. మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.