
- మూడేండ్ల కింద రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారి
- ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకున్న యూపీ ప్రభుత్వం
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీని ఉత్తరప్రదేశ్(యూపీ) ప్రభుత్వం కానిస్టేబుల్గా డిమోట్చేసింది. మూడేండ్ల కింద ఓ హోటల్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన అతనిపై విచారణ చేపట్టి తాజాగా కఠిన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన కృపా శంకర్ కన్నౌజియా డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ) హోదాలో ఉన్నారు.
కృపా శంకర్ 2021లో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్గా పనిచేశారు. అదే ఏడాది జులై 6న ఫ్యామిలీకి సంబంధించిన పనులు ఉన్నాయంటూ రిక్వెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసు నుంచి సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లోని ఓ హోటల్కు వెళ్లాడు. తన ఆఫీషియల్, పర్సనల్సెల్ఫోన్లు స్వీచ్ ఆఫ్చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్విచ్ఆఫ్వస్తుండడంతో అతని భార్య ఎస్పీ ఆఫీసుకు ఫోన్చేసి హెల్ప్ కావాలని కోరింది. దీంతో వారు ఎంక్వైరీ చేయగా అతని సెల్ఫోన్లు కాన్పూర్లోని ఓ హోటల్లో స్వీచ్ఆఫ్ అయినట్టు లోకేట్అయ్యాయి. పోలీసులు అక్కడికి వెళ్లి చెక్చేయగా హోటల్ రూమ్లో మహిళా కానిస్టేబుల్తో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై అప్పటి లక్నో రేంజ్ ఐజీ కఠిన చర్యలకు సిఫార్స్ చేశారు. ఎంక్వైరీ ముగించిన అధికారులు తాజాగా యాక్షన్తీసుకున్నారు. ప్రస్తుతం కృపా శంకర్ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) గోరఖ్పూర్ బెటాలియన్లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యాడు.