మహిళా కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం..డీఎస్పీ నుంచి కానిస్టేబుల్​గా డిమోషన్

మహిళా కానిస్టేబుల్​తో వివాహేతర సంబంధం..డీఎస్పీ నుంచి కానిస్టేబుల్​గా డిమోషన్
  •     మూడేండ్ల కింద రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ అధికారి
  •     ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకున్న యూపీ ప్రభుత్వం

లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీని ఉత్తరప్రదేశ్​(యూపీ) ప్రభుత్వం కానిస్టేబుల్​గా డిమోట్​చేసింది. మూడేండ్ల కింద ఓ హోటల్​లో రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన అతనిపై విచారణ చేపట్టి తాజాగా కఠిన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్​గా పోలీస్​ డిపార్ట్​మెంట్​లో చేరిన కృపా శంకర్ కన్నౌజియా డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ) హోదాలో ఉన్నారు.

 కృపా శంకర్ 2021లో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్​గా పనిచేశారు. అదే ఏడాది జులై 6న ఫ్యామిలీకి సంబంధించిన పనులు ఉన్నాయంటూ రిక్వెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసు నుంచి సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్​తో కలిసి కాన్పూర్​లోని ఓ హోటల్​కు వెళ్లాడు. తన ఆఫీషియల్, పర్సనల్​​సెల్​ఫోన్లు స్వీచ్ ఆఫ్​చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్విచ్​ఆఫ్​వస్తుండడంతో అతని భార్య ఎస్పీ ఆఫీసుకు ఫోన్​చేసి హెల్ప్ కావాలని కోరింది. దీంతో వారు ఎంక్వైరీ చేయగా అతని సెల్​ఫోన్లు కాన్పూర్​లోని ఓ హోటల్​లో స్వీచ్​ఆఫ్ అయినట్టు లోకేట్​అయ్యాయి. పోలీసులు అక్కడికి వెళ్లి చెక్​చేయగా హోటల్ రూమ్​లో మహిళా కానిస్టేబుల్​తో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై అప్పటి లక్నో రేంజ్ ఐజీ కఠిన చర్యలకు సిఫార్స్ చేశారు. ఎంక్వైరీ ముగించిన అధికారులు తాజాగా యాక్షన్​తీసుకున్నారు. ప్రస్తుతం కృపా శంకర్ ప్రావిన్షియల్ ఆర్మ్‌‌‌‌‌‌‌‌డ్ కానిస్టేబులరీ (పీఏసీ) గోరఖ్‌‌‌‌‌‌‌‌పూర్ బెటాలియన్‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా అపాయింట్ అయ్యాడు.