బీఎస్పీకే ఓటు వేయండి

బీఎస్పీకే ఓటు వేయండి

బీఎస్పీ అధికారంలో ఉండగా చేసిన పనుల పేర్లు మార్చి ఇతర పార్టీల ప్రభుత్వాలు లబ్ధి పొందుతున్నాయన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి. ఆగ్రాలో ఎన్నికల ప్రచారం చేసిన మాయావతి... బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో బీఎస్పీ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  బీజేపీ హయాంలో దళితులు, మహిళలకు భద్రత లేదన్నారు.  దళితుల ఓట్లను రాబట్టేందుకు కాంగ్రెస్ మాయమాటలు చెబుతుందని..ఆ పార్టీ ఆడే నాటకాలను ఎవరూ నమ్మరన్నారు. తమ నాయకుడు కాన్షీరామ్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆమె ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు మాయావతి. తప్పుడు విధానాల కారణంగానే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు. బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలు మమ్మల్ని మోసం చేశారని చెప్పారు. ప్రజాహితం కోసం తాము చేసినన్ని పనులు మరే ప్రభుత్వం కూడా చేయలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం

మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

అటెంప్ట్​ మర్డర్​ కేసులో ఎమ్మెల్యే నితీష్ రాణే కు బెయిల్ నిరాకరణ