ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లోని ఓ పాఠశాలలో తన క్లాస్మేట్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన పదో తరగతి విద్యార్థిపై కేసు నమోదైంది. ఈ ఘటన సెప్టెంబర్ 12న జరిగింది. స్కూల్ బ్యాగ్ పాడుచేశాడని ఆరోపించిన విద్యార్థి.. తన తోటి విద్యార్థితో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థిని ఏఎంయూ JN మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. అతని శరీరం దాదాపు 25 శాతం కాలిపోయిందని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఘటన అనంతరం బాలుడి తల్లిదండ్రులు సివిల్ లైన్స్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
“ఈ సంఘటన మంగళవారం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ AMU సిటీ స్కూల్లో జరిగింది. బ్యాగ్ పాడవడంతో ఇద్దరు క్లాస్మేట్స్ మధ్య గొడవ జరిగింది. “బ్యాగ్ పాడైపోయిన బాలుడు క్యాంపస్లో పార్క్ చేసిన మోటార్సైకిల్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి తన క్లాస్మేట్పై పోసి నిప్పంటించాడు. ఈ ఘటన పాఠశాల క్యాంపస్లో భయాందోళనకు గురి చేసింది అని AMU అధికారి తెలిపారు.