అయోధ్య ఎయిర్‌పోర్టు పేరు మార్పు!

అయోధ్య ఎయిర్‌పోర్టు పేరు మార్పు!

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా మార్చాలని యూపీ కేబినేట్ నిర్ణయించింది. ఆ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆమోదించబడింది. మంత్రుల మండలి ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ నుంచి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపాలని నిర్ణయించారు. అయోధ్యలో రామ్ మందిర్ కోసం ఆగస్టు 5న శంఖుస్థాపన జరిగింది.