యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై

యూపీలో బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే రిజైన్ చేశారు. షికోహాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ముకేశ్ వర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీమంత్రి స్వామి ప్రసాద్ మౌర్యనే తమ నాయకుడని అన్నారు. ఆయనేం నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. మున్ముందు.. బీజేపీకి మరింత మంది రాజీనామా చేస్తారన్నారు ముఖేశ్ వర్మ.