తన చిత్రవిచిత్ర డ్రెస్సులతో నిత్యం వార్తల్లో ఉండే నటి ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకోసారి తన గురించి మాట్లాడొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలింతకీ ఏమైందని ఆరా తీస్తే.. ఇటీవల రాజ్ కుంద్రా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్తో పూర్తిగా మొహాన్ని కవర్ చేసుకుని కనిపిస్తున్నాడు.
దీంతో మీడియా అతడిని ప్రశ్నిస్తే.. ‘నేనేం వేసుకుంటున్నాను.. ఉర్ఫీ ఏం వేసుకోవడం లేదు’ అనే రెండు విషయాలే మీడియాకు అత్యవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఉర్ఫీ సీరియసైంది. అమ్మాయిల బట్టలు విప్పి సంపాదించే వారు నా బట్టల గురించి మాట్లాడుతున్నారంటూ చురకలు అంటించింది. ఇటీవల రాజ్కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.