భారత్ కు 6 కోట్ల వ్యాక్సిన్ డోసులివ్వండి

భారత్ కు 6 కోట్ల వ్యాక్సిన్ డోసులివ్వండి

భారత్ కు 6 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కోరారు సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ రెవ్ జెస్సి జాక్సన్ సీనియర్ , ఇండో-అమెరికన్ రాజ కృష్ణమూర్తి. ప్రపంచదేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించింది అమెరికా. ఇందులో 6 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇండియాకు పంపించాలని వీరిద్దరూ బిడెన్ ను కోరారు. భారత్ లో వ్యాప్తి చెందుతున్న వేరియంట్ ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు జాక్సన్. కరోనాకు సరిహద్దులు లేవన్నారు.  ఇండియాకు రెస్పిరేటర్లు, ఆక్సిజన్ అవసరమన్నారు. ఇండియాలో ఇప్పటికే కోటి డోసులు పంపిణీ చేశారన్న జాక్సన్..ప్రాణాలు కాపాడేందుకు అమెరికా మరింత సాయం చేయాలన్నారు. కరోనా సంక్షోభంపై అమెరికాలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో ఒకరైన రాజకృష్ణమూర్తి కూడా ఇండియాకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.