
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత కాల్పుల ఒప్పందం విషయంలో మూడో వ్యక్తి లేదా దేశపు ప్రమేయం లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. దీనికి ముందు వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపింది తానేనని డప్పు కొట్టుకున్నారు. మోదీ ప్రకటన తర్వాత యుద్ధాన్ని తాను ఆపలేదని ఇండియా పాక్ చర్చించుకుని తీసుకున్న నిర్ణయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజా ట్రంప్ మళ్లీ తన పాట తిరిగి పాడుతున్నారు. తాను ఇటీవల ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదంటూ చేసిన పోస్ట్ వార్తల్లో నిలిచింది. 2026లో శాంతి బహుమతికి పాక్ తన పేరును నామినేట్ చేయాలనుకుంటోందని ట్రంప్ వెళ్లడింటారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపానని తనకు తాను చెప్పుకోవటం నోబెల్ శాంతి బహుమతి కోసమా అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. తానెంత కష్టపడి యుద్ధాన్ని ఆపినా తనకేమీ లాభం లేకుండా పోయిందే అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
►ALSO READ | ఒక్క ఫోన్ కాల్ లీక్.. చిక్కుల్లో థాయ్లాండ్ ప్రధాని షినవత్రా!
పాక్ కోరితేనే తాము కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రధాని మోదీ చెబుతూ ఇందులో అమెరికా పాత్ర 1 శాతం కూడా లేదని చెప్పేశిన తర్వాత కూడా ట్రంప్ తన శాంతి చర్చలే కారణమంటూ చెప్పుకోవటం విచిత్రంగా ఉందని చాలా మంది అంటున్నారు. అలాగే తాను రవాండ కాంగో మధ్య కూడా యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ చెప్పారు. త్వరలోనే ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు వెల్లడైంది. అలాగే తాను సెర్బియా కొసోవా, ఈజిప్ట్ ఇతోఫియా మధ్య యుద్ధాన్ని నివారించినా తనకు శాంతి బహుమతి లభించదని చెప్పుకొచ్చారు.
అలాగే ఇజ్రాయెల్ తో అనేక అరబ్ దేశాలకు కుదిరిన ఒప్పందాలు కూడా తన వల్లే జరిగినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కూడా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాను శాంతిని ప్రోత్సహిస్తున్నప్పటికీ తనకు ఆ స్థాయిలో గుర్తింపు దక్కటం లేదని ట్రంప్ చేసిన కామెంట్స్ ద్వారా అర్థం అవుతోంది.