పార్టీ బలోపేతంపై నేతలతో మాయావతి మీటింగ్

పార్టీ బలోపేతంపై నేతలతో మాయావతి మీటింగ్

ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయారు. పార్టీ ఓటమిపై సమీక్షించేందుకు లక్నోలో బీఎస్పీ చీఫ్ మాయావతి ఆధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలు, ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమికి గల కారణాలను సమీక్షిస్తున్నారు. అలాగే పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో మమేకమై సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు మాయావతి సూచించినట్టు సమాచారం.

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు