ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ : ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. స్నేహితుడిని చంపేసిన మరొకడు

ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ : ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. స్నేహితుడిని చంపేసిన మరొకడు

ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు..ఒకరికి తెలియకుండా ఇంకొకరు..విషయం తెలిసిన తర్వాత ఆమెను నువ్వు వదిలేయ్.. అంటే నువ్ వదిలేయ్ అని ఒకిరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు. కలిసి తిరిగిన స్నేహితులే అయినా..అమ్మాయికోసం శత్రవులు అయ్యారు. చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చారు.  ప్రేమించిన యువతికోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. 

ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలోని రహీమాబాద్ ప్రాంతంలో  రైల్వేస్టేషన్ వెనక ఉన్న అటవీ ప్రాంతంలో ఓ ట్యాక్సీ డ్రైవర్ పై అతని స్నేహితుడు కాల్పులు జరపడంతో మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..హత్యకు సంబంధించిన దర్యాప్తు చేస్తుండగా.. సంచలన విషయాలు బయటికొచ్చాయి. 

మొదట ఇది గ్యాంగ్ వార్ గా అనుమానించిన పోలీసులు.. విచారణలో ఓ అమ్మాయికోసం ఓ వ్యక్తిపై అతని స్నేహితుడే కాల్చి చంపాడని నిర్ధారణకు వచ్చారు. రహీమాబాద్ కు  చెందిన వినయ్ ద్వివేది, వికాస్ కుమార్ ఇద్దరు మంచి స్నేహితులు.. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. అప్పటివరకు ఈ విషయం ఇద్దరికీ తెలియదు.. విషయం తెలిశాక.. ఆమెను నువ్వు వదిలేయ్.. అంటే నువ్వు వదిలేయ్ అని ఘర్షణకు దిగారు.. ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు.. 

ఈక్రమంలో వికాస్ కుమార్ తన మరో స్నేహితుడైన మహేంద్రకు విషయం చెప్పాడు.. ఎలాగైన వినయ్ ద్వివేదిని చంపేయాలని మహేంద్రతో కలసి ప్లాన్ చేశాడు.. బుధవారం ( నవంవర్1) రాత్రి 11 గంటలకు సమీప రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతానికి రమ్మని వినయ్ ద్వివేదిని పిలిపించారు.. వికాస్ కుమార్, మహేంద్ర కలిసి వినయ్ ద్వివేదిని గన్ తో కాల్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ద్వివేదిని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ద్వివేది మృతిచెందాడు.

Also Read :- ఈడీ నోటీసులు చట్టవిరుద్ధం..విచారణకు హాజరుకాలేను : కేజ్రీవాల్