ప్రధాని మోదీపై పోటీ చేయబోతున్న కాంగ్రెస్ లీడర్ ఎవరో తెలుసా..?

ప్రధాని మోదీపై పోటీ చేయబోతున్న కాంగ్రెస్ లీడర్ ఎవరో తెలుసా..?

లోక్ సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు నేతలకు టికెట్లు ఇస్తూ ప్రచారం స్టార్ట్ చేసుకోవచ్చని నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలోని పెద్ద లీడర్ల పై పోటీ చేయబోయే నేతలపై అందరికి ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ప్రధాని మోదీపై పోటీ చేయబోయే కాంగ్రెస్ లీడర్ ఎవరా అని అంతా ఎదురు చూస్తున్నారు.

 ఈ ఉత్కంఠతకు తెర తీసి కాంగ్రెస్ పార్టీ నాలుగో లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్టులో ప్రధాని మోదీపై పోటీ చేసే అభ్యర్థిని హస్తం పార్టీ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్ ను మోదీపై పోటీ చేయమని బరిలో దింపింది. ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి నుంచి 2009లో SP, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మోదీని మూడోసారి ఢీకొట్టబోతున్నారు. ఎస్పీ, ఆప్ పొత్తు ఉండటం కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. 

మరోవైపు 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 8న విడుదల చేసింది. అందులో 39 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా అందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది.  ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 185 మంది అభ్యర్థులను ప్రకటించింది.