ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో  రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతాలోని బుల్హాద్- బైలా రహదారి వద్ద వాహనం అదుపు తప్పి కొండగట్టులో పడింది. ఈ ఘటనలో  13 మంది మరణించగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. వాహనాల్లో ఓవర్‌లోడ్‌ లేకుండా చూసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహనాలపై ఓవర్‌లోడ్‌ను అనుమతించవద్దని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.