కాళేశ్వరం బ్యారేజీల్లోనీళ్లు నిల్వ చేయొచ్చా..? టెక్నికల్ గైడెన్స్ కోరండి.. ఇరిగేషన్ ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల్లోనీళ్లు నిల్వ చేయొచ్చా..? టెక్నికల్ గైడెన్స్ కోరండి.. ఇరిగేషన్ ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
  • కేంద్ర జలశక్తి శాఖ,  ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ నుంచి మరోసారి క్లారిటీ తీసుకోండి
  • ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ తుది నివేదిక ప్రకారమే గేట్లు ఖుల్లా పెట్టామన్న మంత్రి
  • అన్నారం బ్యారేజీ కింద కూడా గోతులున్నాయన్న అధికారులు
  • బ్యారేజీల నుంచి వరద నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదని వివరణ

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేసి, ఎత్తిపోయొచ్చా? లేదా? అనే విషయంలో మరోసారి కేంద్ర జలశక్తి శాఖ, నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) నుంచి టెక్నికల్​గైడెన్స్ తీసుకోవాలని  ఇరిగేషన్​ అధికారులను  మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. గతంలో ఎన్​డీఎస్‌‌ఏ సలహా మేరకే బ్యారేజీల భద్రత దృష్ట్యా గేట్లు ఓపెన్​ చేసి పెట్టామని స్పష్టం చేశారు. 

కేంద్ర సంస్థల నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు వచ్చినప్పుడే కాళేశ్వరం లిఫ్టులను నడిపిస్తామని తేల్చి చెప్పారు. బ్యారేజీల పరిస్థితి బాగాలేనందున వాటికి రిపేర్లు చేసేదాకా గేట్లు ఖుల్లా పెట్టాలంటూ గతంలో ఎన్‌‌డీఎస్‌‌ఏ ఇచ్చిన రిపోర్ట్, ఇతరత్రా టెక్నికల్​ అంశాలను బయటకు తీసి, ఆ కాపీని కేంద్రజలశక్తి శాఖ, ఎన్​డీఎస్​ఏ అధికారులకు పంపించి.. వివరణ కోరాలన్నారు.  వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్​ కమిషనర్‌‌‌‌కు సంబంధిత పత్రాలను అందించి.. జలశక్తి శాఖకు పంపించేలా చూడాలని ఆదేశించారు. 

శుక్రవారం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌‌కుమార్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల్లో సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) గుర్తించిన లోపాలు, గ్రౌండ్​పెనట్రేటింగ్​ రాడార్​ (జీపీఆర్) టెస్టులు, రాఫ్ట్‌‌ల కింద ఉన్న భారీ గోతులపై ఆధారాలతో ఎన్‌‌డీఎస్‌‌ఏకి వివరించాలని స్పష్టంచేశారు. 

అన్నారం బ్యారేజీల్లోనూ లోపాలు 

మూడు బ్యారేజీల్లో సెంట్రల్​వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​స్టేషన్​(సీడబ్ల్యూపీఆర్‌‌‌‌ఎస్​) స్టడీస్​ పూర్తి కావొచ్చాయని మంత్రి ఉత్తమ్‌‌కు అధికారులు వివరించారు. అన్నారం బ్యారేజీలోనూ లోపాలున్నట్టు గుర్తించామన్నారు. బ్యారేజీ రాఫ్ట్​ కింద గోతులున్నాయని తేలిందని వివరించారు. మేడిగడ్డ డిజైన్లు ఆగస్టు చివరి వరకు పూర్తవుతాయని తెలిపారు. సెప్టెంబర్​ రెండో వారం నాటికి రిపేర్ల ఖర్చులపై ప్రాథమిక అంచనా వస్తుందని  చెప్పారు. 

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఇన్వెస్టిగేషన్స్​డేటా 2 వారాల్లో వస్తుందని వివరించారు. బ్యారేజీలకు వరద వస్తున్నంత మాత్రాన నీటిని ఎత్తిపోయడానికి వీలుకాదని తేల్చి చెప్పారు. ఎగువన ప్రస్తుతం నీటి స్థాయిలను మెయింటెయిన్​ చేసే పరిస్థితి లేదన్నారు. బ్యారేజీల హైడ్రాలిక్​ పరిస్థితులను తేల్చకుండా తాత్కాలికంగా కూడా పంపింగ్​చేసేందుకు ఆస్కారమే లేదని చెప్పారు. లిఫ్టింగ్​ చేస్తే అనవసరమైన ముప్పు తలెత్తి.. బ్యారేజీలకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.  

కాగా, తదుపరి మీటింగ్‌‌లో టెక్నికల్​ ఓవర్​సైట్​ కమిటీ ముందు బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చు ప్రతిపాదనలు పెట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని లిఫ్టింగ్‌‌పై ఎలాంటి అనవసర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కాగా, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలపైనా మంత్రి రివ్యూ చేశారు. నీటి కేటాయింపుల సమస్యలు, ట్రిబ్యునల్​ వాదనలు జరుగుతున్న తరుణంలో ప్రాజెక్ట్​ డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్​) ప్రాసెస్​ కావట్లేదని మంత్రి ఉత్తమ్‌‌కు అధికారులు తెలిపారు.