ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తన మార్క్ మాస్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. అన్నిరకాల కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే టైటిల్ టీజర్తో ఆకట్టుకున్న టీమ్, తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కలర్ఫుల్ షర్ట్, మెడలో చైన్స్తో లుంగీ పైకి కట్టి స్టెప్పులు వేస్తూ మాస్ అప్పీరియన్స్తో ఫిదా చేశారు మెగాస్టార్. ‘బాస్ సాంగ్’ పల్లవితో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట బిగ్గెస్ట్ పార్టీ సాంగ్ ఆఫ్ ఇయర్గా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి సరసన ఊర్వశి రౌటేలా కనిపించనుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. రవితేజ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.