సింగరేణి ల్యాండ్​ను ఆక్రమించిన మాజీ ఉద్యోగి..స్వాధీనం చేసుకున్న అధికారులు

సింగరేణి ల్యాండ్​ను ఆక్రమించిన మాజీ ఉద్యోగి..స్వాధీనం చేసుకున్న అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీకి చెందిన విలువైన ల్యాండ్​ను కంపెనీలో పనిచేసి రిటైర్​ అయిన ఓ ఉద్యోగి ఆక్రమించుకున్నారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​ ప్రాంతంలో గల దాదాపు 400 గజాల సింగరేణి ల్యాండ్​ను ఇటీవలే రిటైర్​ అయిన ఓ ఉద్యోగి ఆక్రమించుకొని నిర్మాణం చేపట్టారు. ఈ ల్యాండ్​ విలువ దాదాపు రూ. 1.50కోట్లకుపైగానే ఉంటుంది. కాగా ల్యాండ్​ను ఆక్రమించి నిర్మాణం చేపడ్తున్న విషయాన్ని సింగరేణి ఇంటిలిజెన్స్​, సెక్యూరిటీ గుర్తించాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సింగరేణి సెక్యూరిటీ ల్యాండ్​ ఆక్రమణకు గురైన ప్రాంతానికి చేరుకున్నారు. ఆక్రమణతో పాటు అక్రమ నిర్మాణంపై వివరాలు సేకరించారు. సింగరేణి ఎస్టేట్​ ఆఫీసర్లు ఈ ల్యాండ్​ సింగరేణిదేనని తేల్చి చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఈ భూమి సింగరేణికి చెందినదంటూ మంగళవారం బోర్డు పెట్టారు.