- షాపింగ్ కు వెళ్లొచ్చేసరికి ఎత్తుకెళ్లిన దుండగులు
ఎల్బీ నగర్, వెలుగు: ఓ కుటుంబం షాపింగ్ కు వెళ్లొచ్చేసరికి 3 గంటల వ్యవధిలోనే దుండగులు 13 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. సచివాలయ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకట హరీశ్ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు.
3 గంటలకు తిరిగి ఇంటి రాగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని వెంకట హరీశ్వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
