8న వరలక్ష్మి వ్రతం : ఎలా చేయాలి.. పూజకు ఏం కావాలి.. పూజలో చదవాల్సిన మంత్రం ఏంటీ..?

8న వరలక్ష్మి వ్రతం : ఎలా చేయాలి.. పూజకు ఏం కావాలి.. పూజలో చదవాల్సిన మంత్రం ఏంటీ..?

 హిందూ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. తెలుగు క్యాలెండర్ లో ఉండే 12 మాసాల్లో ఐదవది శ్రావణ మాసం. ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. శ్రావణ మాసం, శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ( ఆగస్టు8, 2025)   వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం  హిందూ ఆచారం.ఈ  వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి.. వ్రతం చేసేటప్పుడు ఏఏ మంత్రాలు చదవాలి..   కావలసిన ఐటమ్స్​ గురించి తెలుసుకుందాం. . .

వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైంది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.  వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.  వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం దాని విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆగస్టు 8న మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.  

శ్రీ వరలక్ష్మి  వ్రతం పూజ సామగ్రి 

  • పసుపు 
  • కుంకుమ
  • గంధం
  • విడిపూలు
  • పూల మాలలు 
  • తమలపాకులు 30
  • వక్కలు
  • ఖర్జూరములు
  • అగర్బత్తి
  • కర్పూరము
  • చిల్లర పైసలు Rs. 30/- ( 1Rs coins )
  • తెల్ల టవల్ 
  • బ్లౌస్ పీసులు
  • మామిడి ఆకులు
  • అరటిపండ్లు 
  • ఇతర రకాల పండ్లు
  • అమ్మవారి ఫోటో
  • కలశానికి చెంబు
  • కొబ్బరి కాయలు 3
  • తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం
  •  స్వీట్లు 
  • బియ్యం 2 kg
  • కొద్దిగా పంచామృతం లేదా ఆవు పాలు 
  • ఇంట్లో ఉండే పూజా సామాగ్రి కూడా సిద్దం  చేసుకోవాలి 
  • దీపారాధన కుందులు
  • గంట
  • హారతి
  • ప్లేటు
  • స్పూన్స్
  • ట్రేలు
  • నూనె
  • వత్తులు
  • అగ్గిపెట్టె
  • గ్లాసులు
  • బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం  ( 2025, ఆగస్టు 8) రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి.  అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే.. తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును.  అయితే శ్రావణ మాసంలో ప్రతి  శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ. సుహాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం...

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున  ( ఆగస్టు 8) ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు,  పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి. 

తోరం ఎలా తయారుచేసుకోవాలి :

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి.  ఆ తోరాన్ని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

పూర్తి మంత్రంతో పూజా విధానం: 

ఓం శ్రీ గురుభ్యోం నమ:.. హరి: ఓం.... ఓం గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్ .. శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమ:. .. శ్రీ మహా సరస్వత్వైనమ: .. శ్రీ గురుభ్యోం నమ: హరి: ఓం.. 

  ( ఇది చదవడం రాకపోతే శుక్లాం బరదరం శ్లోకము.. అగజానన పద్మారకం శ్లోకము అయినా చదువుకోవచ్చు) 


ఆచమనం : (మొదటి మూడు నామాలతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి) 
ఓం కేశవాయ స్వాహా                  
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః (చేయికడుక్కోవాలి)
ఓంవిష్ణవే నమః
 ఓం మధుసూదనాయ నమః
ఓంత్రివిక్రమాయ నమః               
ఓం    వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః                   
ఓం   హృషికేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః              
ఓం  దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః              
 ఓం   వాసుదేవాయ నమః
 ఓం ప్రద్యుమ్నాయ నమః           
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః        
ఓం  అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః           
ఓం  అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః               
ఓం    ఉపేంద్రాయ నమః
ఓంహరయే నమః                         
ఓం   శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
 (అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపునుంచి వెనక్కు  వేసుకొనవలయును.

ప్రాణాయామము :

(ఆ తరువాత కుడిచేతి  బొటనవేలు.. ఉంగరం వేలు..మధ్యవేళ్లతో  ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.)

 ఓం భూః, ఓంభువః, ఓం​సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం 

( పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.)

సంకల్పం : ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) ( శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో చదువుకొని..) సమస్త దేవతా.. బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ.. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావశునామ సంవత్సరే.... దక్షిణాయనే... వర్ష ఋతౌ.... శ్రావణమాసే... శుక్లపక్షే ... ..... తిధౌ, బృగువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ శ్రీమాన్​ శ్రీమత: ... (ఇక్కడ గోత్రం పేరు).. మమ ధర్మపత్ని    ( పేరు ..గోత్రం) అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే..

( మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకోవాలి) (కుడిచేతి మధ్య వేలితో నీళ్లు ముట్టుకోవాలి)

 అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూజాం కరిష్యే
 తదంగ కలశారాధనం కరిష్యే.

కలశ పూజ

(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి,  లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సప్త ద్వీపో వసుంధరా|
ఋగ్వేదో  యజుర్వేద: సామవేదో హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||

కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)

గణపతి పూజ

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు.. పూలు  చల్లాలి.
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.( 
నమః అన్నప్పడు స్వామి వారి దగ్గర  ఉంచాలి.)

ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి ( అగర్​ బత్తీలు వెలిగించాలి)
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ( దీపారాధన చూపించాలి)
( పసుపు విఘ్నేశ్వరుడి ముందు  పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి. )
 ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,..భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!( (అంటూ నీటిని నివేదన చుట్టూ జల్లుతూ)) … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం  సమర్పయామి.
(కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి……నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!   అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!  అంటూ ……  ( వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.)
ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

అధాంగపూజ

(పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.)

ఓం చంచలాయై నమః .. పాదౌ పూజయామి.   
ఓం చపలాయై నమః ... జానునీ పూజయామి,  
ఓం   పీతాంబరాయైనమః ... ఉరుం పూజయామి, 
ఓం   కమలవాసిన్యైనమః – కటిం పూజయామి,    
ఓం పద్మాలయాయైనమః– -నాభిం పూజయామి,  
ఓం  మదనమాత్రేనమః ... స్తనౌ పూజయామి,  
ఓం  కంబుకంఠ్యై నమః- ..కంఠంపూజయామి, 
 ఓం  సుముఖాయైనమః – ముఖంపూజయామి,   
ఓం సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి,
ఓం రమాయైనమః – కర్ణౌ పూజయామి,
ఓం కమలాయైనమః – శిరః పూజయామి
ఓం శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరపూజ :

(తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.)

ఓం  కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
ఓం  రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
ఓం  లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
ఓం  విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
ఓం  మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
ఓం  క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
ఓం  విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
ఓం  చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
ఓం  శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు.  మునులారా!  స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి   చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు   తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.  ఇంద్రాది దిక్పాలకులు స్తుతి  స్తోత్రములతో పరమశివుడిని కీర్తిస్తు న్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి      నాథా!   స్త్రీలు  సర్వసౌఖ్యములు పొంది...  పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.  అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన  విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే  శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.  అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు  చేశారు?  ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక  బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి.  వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని    ప్రాతఃకాల గృహ కృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-

ఆది  దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో   చారుమతికి కలలో సాక్షాత్కరించింది.   ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను  ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!  నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు.   వారు సంపన్నులుగా, విద్వాంసులుగా   మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు   చూడసాగారు.  శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి   తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో….

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి   ప్రతిష్టించింది.

ఇంటికి వచ్చిన మహిళలంతా  అమ్మవారిని షోడశోపచారాలతో  పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.  ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.   మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు   ఘల్లుఘల్లున   మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న  ఖచిత   కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు.   వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.   ఆయా స్త్రీల ఇళ్ల నుండి   గజ తరగ రథ వాహనములతో  వచ్చి వారిని ఇళ్లకు  తీసుకెళ్లారు.   వారంతా మార్గ  మధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు   వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో  తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా   ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు   కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడు  పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ  వ్రత విధానాన్ని సవిస్తరంగా  మీకు  వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా   సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు   సిద్ధిస్తాయని  సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.  

ఈ కథ చదువుకొని లేదా విని అక్షతలు శిరసుపై   వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ   తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.  రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని  చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది.   సకల శుభాలు   కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం  తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది…. 

సర్వేజనాసుఖినోభవతు.. ఓం స్వస్తి..