ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు : వర్కటం జగన్నాథరెడ్డి

ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు : వర్కటం జగన్నాథరెడ్డి

మక్తల్, వెలుగు : మక్తల్​ ఎమ్మెల్యేచిట్టెం రామ్మోహన్​రెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా భయపడేది లేదని వీజేఆర్​ ఫౌండేషన్​ అధినేత, బీఆర్ఎస్​ నాయకులు వర్కటం జగన్నాథరెడ్డి తెలిపారు. సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఊట్కూర్​లో తనపై, కారుపై దాడి చేయించారని పేర్కొన్నారు. సోషల్​ మీడియాలో ఒక పోస్టు విషయమై ఊట్కూర్  పోలీస్​ స్టేషన్​కు వెళ్లడంతో, ఈ విషయం తెలుసుకుని మండలంలోని పార్టీ  ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు చెప్పి దాడులు చేయించారని చెప్పారు.

సమాజ సేవ చేస్తున్న తనపై  కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మక్తల్  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. తనపై దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కనకప్ప, అరవింద్ రెడ్డి, ఆనంద్, రఘు, ఎల్లప్ప, శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.