న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్స భ స్థానం నుంచి పోటీ చేయాలన్న బీజేపీ ప్రతి పాదనకు ఆ పార్టీ నేత వరుణ్ గాంధీ నో చెప్పా రు. గత లోక్ సభ ఎన్నికల్లో పిలిభిత్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన వరుణ్ గాంధీ కి ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి వరుణ్ గాంధీని బరిలోకి దించాలని భావించింది.
మరోవైపు, సోనియా కుమార్తె, ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకపై పోటీ చేయాలని వరుణ్ గాంధీకి బీజేపీ సూచించింది. అయితే, తన సోదరి ప్రియాంకపై పోటీ చేసేందుకు వరుణ్ నో చెప్పారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాయ్బరేలీలో వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. రాయ్బరేలీతో పాటు అమేథీ స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.